చందుర్తి, నేటిధాత్రి:
వేధింపులు లేకుండా విద్యార్థులకు ధైర్యం కల్పించాలని ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల బాలుర వసతి గృహం సంక్షేమ అధికారి రవీంద్ర స్వామి సూచించారు. చందుర్తి మండల కేంద్రంలోని వసతి గృహంలో గురువారం సాయంత్రం విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మనోవేదానికి గురై విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోకుండా మనోధైర్యాన్ని కల్పించాలని రవీంద్ర స్వామి సూచించారు. ఈ కార్యక్రమంలో వసతి గృహం సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.