మాజీ సీఎం కె సి ఆర్ దిష్టిబొమ్మ దగ్దం

హసన్ పర్తి/ నేటి ధాత్రీ

హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం లోని బస్టాండ్ సమీపంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బి ఆర్ ఎస్ పార్టీ మాజీ సీఎం కె సి ఆర్ దిష్టిబొమ్మను తగులబెట్టారు ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణ నీళ్లు దొంగ ఒప్పంధాలు చేసి తరలించింది కెసిఆర్ అని పింగిలి వెంకట్రాంరెడ్డి కిసాన్ సెల్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు అన్నారు కిసాన్ సెల్ ఆధ్వర్యంలో హసన్ పర్తి లో మాజీ సిఎం కెసిఆర్ దిష్టి బొమ్మ దహనం చేశారు.కాళేశ్వరం ప్రాజెక్టు లో జరిగిన అవినీతి నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి నల్గొండలో సభ పెడుతున్నారని తెలిపారు.అసెంబ్లీ ఫలితమే పార్లమెంట్ ఎన్నికలోనూ రిపీట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు రైతులకు కెసిఆర్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు పింగిళి వెంకట్ రామనర్సింహారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, మాజీ పీఏసీ చైర్మన్ తోకల లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ తంగెళ్లపల్లి తిరుపతి, పీఏసీఎస్ చైర్మన్ ఉదయ్ రెడ్డి,పోలేపాక అశోక్, సంపత్ యాదవ్, పుల్లా రవీందర్, బాడిశ సతీష్, రాంరాజు, మురళీవెంకట్, స్వామి, అంబురవంకట్, , తోకల జగన్, వెంకన్న, మండల యూత్ చరణ్, గొర్రె కిరణ్, డివిజన్ అధ్యక్షులు కిరణ్,రఘు, ప్రేమ్, సునీల్, బల్స్కురి శ్రీను, మరియు గ్రామ అధ్యక్షులు మరియు కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *