Farmers Demand Fair Compensation for Land Acquisition
మార్కెట్ విలువ ప్రకారం రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం బలవంత భూసేకరణ అన్యాయం…. మోరే రవీందర్ రెడ్డి
మొగులపల్లి నేటి ధాత్రి
నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం మొగులపల్లి మండల కేంద్రంలోని రైతులను అక్రమంగా అరెస్టు చేసి బలవంతంగా తమ భూమిలోని చొరబడి తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మొగులపల్లి మండల కేంద్రంలో ప్రస్తుతమున్నటువంటి మార్కెట్ విలువ ప్రకారము పరిహారం చెల్లించాలని కానీ తమకు తక్కువ పరిహారము చెల్లించడం అన్యాయమని మొగులపల్లి మండల కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి నబాబుపేట గ్రామంలో 27 లక్షల 50 వేల రూపాయలు చెల్లించి మొగులపల్లి మండల కేంద్రానికి కేవలం 22 లక్షల 50 వేలు చెల్లించడం ఏంటని అంతేకాకుండా మొగులపల్లి మండలంలోని రంగపురం గ్రామానికి నోటిఫికేషన్ తర్వాత ఆ గ్రామానికి 21,50,000 నిర్ణయించి మండల కేంద్రానికి 22 లక్షల 50 వేలు నిర్ణయించి రైతులు ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ విలువ ప్రకారము ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎన్నో ధర్నాలు రాస్తారోకోలు నిరసనలు చేపట్టిన తర్వాత రంగపురం గ్రామానికి నోటిఫికేషన్ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న వాటిని పరిగణలోకి తీసుకొని 29 లక్షల 60000 మండల కేంద్రానికి తక్కువ ధర నిర్ణయించడం ఎంతవరకు

సబవని వెంటనే మండల కేంద్రానికి మిగతా గ్రామాల కంటే ఎక్కువ ధర చెల్లించాలని లేనిచో ఎంతటి త్యాగానికైనా సిద్ధమని అరెస్టు చేసి ఎన్ని రోజులు మమ్ములను ఆపగలరని మా వారసత్వంగా వస్తున్నటువంటి మా తాత ముత్తాతల నుండి మా కుటుంబాలకు జీవనాధారముగా నుండి భూమిని కోల్పోవడం చాలా అన్యాయమని మా కుటుంబాలకు తగిన న్యాయం చేయాలని కలెక్టర్ గారు ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు పోలీసులతో బలవంతపు భూసేకరణ చేపట్టినటువంటి తాసిల్దారు గారు మొగలపల్లి మండల కేంద్రానికి ఎందుకు వివక్షత అని ఆ మండల కేంద్రానికి కూడా సరైన ధర నిర్ణయించి న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రైతులు బండారి రవీందర్ అరికాంతపు కృష్ణారెడ్డి కొల్లూరు మనోహర్ స్వప్న అడ్డూరి రాజేందర్ గుండా బిక్షపతి గుర్రపు సునంద రెడ్డి ముడుపు మల్లారెడ్డిమోరే పద్మ మోరే అనూష చిలకామారి బొంద్యాలు గుర్రపు తిరుపతిరెడ్డి బోయిన కుమార్ రైతులు తదితరులు పాల్గొన్నారుa
