ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీ అడ్డుకోవాలి.

ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీ అడ్డుకోవాలి.

◆ స్వతంత్ర నియంత్రణ సంస్థల ఏర్పాటు అవసరం.

◆ ప్రభుత్వ పాఠశాలల నాణ్యతను ప్రచారం చేయాలి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

తెలుగు రాష్ట్రాల్లో గత రెండు దశాబ్దాలలో ప్రైవేట్ బిద్యా సంస్థల సంఖ్య విపరీతంగా పెరిగింది. పాఠశాలల నుండి ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల వరడు, ప్రైవేట్ సంస్థలు విద్యా రంగంలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ సంస్థలు గ్రామీణ ప్రాంతాల నుండి నగరాల వరకు విస్తరించాయి. అయితే, బీట్ లాభాపేక్ష, వాణిజ్య ధోరణి దల్ల పేద మధ్యతరగతి కుటుంబాలకు బిద్య భారంగా మారింది. పేద విద్యార్థులు తర్కును ఫీజుల బదులలో చదువుకుంటే, అర్కడ సౌకర్యాలు బోధనా నాణ్యత తక్కువగా ఉంటాయనే భావన పెద ప్రజల్లో బలంగా నాటుకునేలా చేయడం తో పిల్లల విద్య కోసం ఎంత కష్టమైన ధరించి ఉన్నత చదువులు చదివించాలని అమాయక తల్లి దండ్రులు ఈ ప్రైవేట్ విద్యా సంస్థలను నమ్ముడుని లక్షల్లో ఫీజులు చెల్లిస్తున్నారు.

private education


ఈ సంస్థలు ఆధునిక సౌదర్యాలు, ఇంగ్లీష్ మాధ్యమం, ఉన్నత విద్యా ప్రమాణాలను అందిస్తానని చెప్పుకుంటాయి. విపరీతమైన ఫీజులను వసూలు చేస్తాయి. పైగా అనేక ప్రైవేట్ సంస్థలు పేద విద్యార్థులకు ప్రవేశ అవకాశాలను నిరాకరిస్తాయి. ఆర్థిర స్థితి, కులం, లేదా నేపథ్యం ఆధారంగా వివర్ల చూపడం ఇక్కడ సర్వసాధారణం. సంపన్న వర్గాల విద్యార్థులకు మాత్రమే గుణాత్మర విద్య అందేలా ప్రణాళికలు తయారు. చేస్తారు. సెక్షన్’ ల వారీగా విద్యార్థులను విడదీసి, ఎవరు ఎర్చుకను తెలివైన వారో, ఎవరు చదువులో చురుగ్గా ఉన్నారో వా ప్రత్యేక క్లాస్సులు అంటూ ఫీజులు గుంజుతారు. అభ్రకు రీతిలో డొనేషన్లు అదనపు ఫీజులు కమాలు చేయడం మామూలు విషయంగా మారింది. లక్షల్లో విద్యార్థులు ఉంటే అందులోంచి ముంచి మార్పులు సాధించిన రేడల 10 నుంచి 20 బిద్యార్థుల ఫోటో ల తో తను సంస్థల్లో అత్యాదిక మార్కులు సాధించిన విద్యార్థులంటూ ప్రచారం చేసుకుని, అమాయక దండ్రులను ఆరర్షించే ప్రణాళిక రూపొందించుకుంటారు. అదే బిధంగా ఊదూరా ప్రచారం నిర్వహిస్తారు. ప్రైవేట్ సంస్థలలో పోటీతత్వం అధిరంగా ఉంటుంది.ర్యాంకులు, గ్రేమ్లు, పరీక్షలపై దృష్టి పెట్టడం వల్ల విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. వీరు పెట్టె మానసిక క్షోబ తట్టుకోలేద ఎంతో మంది అమాయక విద్యార్థులు ఆత్మ హత్యలు చేసుడుని జీవితాలను చాలించారు. ఇలాంటి వార్తలు మనం రోజూ పత్రికల్లో చూస్తూనే ఉన్నాం. ప్రైవేట్ విద్యా సంస్తల మానసిక ఒత్తిడి.కారణంగా విద్యార్థిని విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నరని, మానవ హక్కులు, స్వచ్ఛంద సేవ సంస్తలు, మేధావి వర్గ విద్యా వంతులు ప్రబుత్వాలకు మొర పెట్టుకున్నా అంతగా ప్రయోజనం జరుగలేక పోయింది. ప్రబుత్వాలు నామ మాత్రపు చర్యలు తీసుకున్నట్లు కనబడుతున్నారే గాని వాస్తవ స్తితి భిన్నంగా ఉంది.ప్రైవేట్ విద్యా సంస్థలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. ఫీజుల నియంత్రణ,ప్రవేశ విధానాలు, బోధనా నాణ్యతపై

కఠినమైన చర్యలు లేకపోవడం వల్ల ఈ సంస్థలు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల
నాణ్యతను ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన విద్యా అందించడం లేదనే అపవాదు ను తుడిచి వేయాలి. అధికారులు,ప్రభుత్వం ఈ దిశ లో చర్యలు తీసుకోవాలి,
గతం లో కంటే ప్రస్తుతం ప్రబుత్వ బడులు మెరుగ్గానే ఉన్నాయి. కానీ పాత అపవాదు మోసుకుని సాగుతుండటం తో ప్రైవేట్ బడులు లబ్ది పొందుతున్నాయి. ఇదే క్రమంలో ప్రభుత్వ పాఠశాలల సౌకర్యాలు, బోధనా నాణ్యతను ఇంకా మెరుగుపరచడం ద్వారా పేద విద్యార్థులకు ఉచిత, గుణాత్మక విద్యను
అందించవచ్చు. ప్రైవేట్ బడుల దోపిడిని అరికట్టవచ్చు. ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలపై నిఘా ఉంచే స్వతంత్ర నియంత్రణ సంస్థలను ఏర్పాటు చేయాలి. అప్పుడే అందరికీ సమానమైన, గుణాత్మక విద్యను అందించే దిశగా ప్రబుత్వ బడులు సాగుతాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version