Water Booth Opened in Parakala
పురపాలక సంఘం ఆధ్వర్యంలో చలివేంద్ర ఏర్పాటు
పరకాల,నేటిధాత్రి
పురపాలక సంఘం పరకాల పరిధిలో ప్రజల సౌకర్యార్థం అంబేద్కర్ సెంటర్ (కూడలి)వద్ద చలివేంద్రను ప్రారంభించారు.వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందించేందుకు ఈ సదుపాయం ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ అంజయ్య పేర్కొన్నారు.వేసవి కాలంలో ప్రజలు ఈ చలివేంద్రాన్ని వినియోగించుకోవాలని సూచించారు.16వవార్డు కౌన్సిలర్ బండి శ్రీదర్,19వవార్డు కౌన్సిలర్ కొయ్యడ శ్రీనివాస్,21వవార్డు కౌన్సిలర్ సుదమల్ల రమేష్ చలివేంద్రాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి,ఒంటెరు శ్రావణ్,ఐలిపెల్లి స్వామి,బండి రాజేందర్,అంగన్వాడీ టీచర్ తదితరులు పాల్గొన్నారు.
