యాదవ యువతను అన్ని రంగాల్లో చైతన్య వంతులను చేయడమే లక్ష్యం
ఎలుక రాజు యాదవ్
ఎండపల్లి నేటి ధాత్రి
అఖిల భారత యాదవ మహాసభ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని అంబారిపేట గ్రామానికి చెందిన ఎలుక రాజు యాదవ్ ను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు ఐలబోయిన రమేష్ యాదవ్ నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా ఎలుక రాజు యాదవ్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బద్దుల బాబురావు యాదవ్, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు పలుమారు మల్లేష్ యాదవ్, నాయకులు జెకె శేఖర్ యాదవ్, మారం తిరుపతి యాదవ్, బొబ్బిలి వెంకటస్వామి యాదవ్, బిసవేణి ముఖేష్ యాదవ్, ఎలుక భగవాన్ యాదవ్, జంగ మహేందర్ యాదవ్ లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, యాదవ సామాజిక వర్గంలో యువతను రాజకీయంగా, సామాజికంగా చైతన్యవంతులను చేస్తూ యాదవ జాతి అభ్యున్నతి కోసం తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. కాగా ఎలుక రాజు యాదవ్ నియామకం పట్ల మాచర్ల రాజేందర్ యాదవ్, కూస లక్ష్మణ్ యాదవ్, జక్కుల రవికుమార్ యాదవ్, మేకల సంతోష్ యాదవ్, రాపాక మహేందర్ యాదవ్,ఆవుల శ్రీనివాస్ యాదవ్, చిత్తారి గంగాధర్ యాదవ్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.