ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు.

Doddi Komurayya's. Doddi Komurayya's.

ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు.  

 

పాలకుర్తి నేటిధాత్రి

 

 

పాలకుర్తి మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, దేవరుప్పుల మండల పార్టీ కార్యాలయంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి పాలకుర్తి ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి హాజరై, దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దొడ్డి కొమురయ్య తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించారు. అన్యాయానికి వ్యతిరేకంగా, రైతుల హక్కుల కోసం పోరాడిన వీరయోధుడు. ఆయన చూపిన మార్గంలో నడిచి, రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తోంది. ముఖ్యంగా రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు రైతుల భద్రతకు కల్పించిన అద్భుత సంక్షేమ కార్యక్రమాలు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, వారి జీవనోపాధిని మరింత మెరుగు పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. అని పేర్కొన్నారు. అదనంగా, రైతులు అన్నదాతలు వారికి గౌరవం కల్పించడం మన బాధ్యత. దొడ్డి కొమురయ్య వంటి పోరాట యోధుల త్యాగాల వల్లే ఈ రోజు రైతులు హక్కులు పొంద గలుగుతున్నారు. ఈ త్యాగాలను గుర్తుంచుకుని, ప్రతి రైతు సంక్షేమానికి పాటుపడాలి అని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్, మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, ప్రాంతీయ నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువకులు, అభిమానులు పాల్గొన్నారు. దొడ్డి కొమురయ్య ఆశయాలను కొనసాగిస్తూ, రైతు సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే  పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!