అధిక ఫీజుల దోపిడీకి చెక్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి
#శనిగరపు రాజేంద్రప్రసాద్
స్వేరోస్ జిల్లా మాజీ అధ్యక్షులు
#ప్రైవేట్ స్కూల్లో దోపిడీపై కొత్త బిల్లు ప్రవేశపెట్టాలి.
#ప్రైవేట్ స్కూలు అధిక ఫీజుల పై నియంత్రణ చేపట్టాలి.
#ప్రైవేట్ స్కూళ్లను కేటగిరి లుగా విభజించి ఆధారంగానే ఫీజులను ఏర్పాటు చేయాలి.
#స్కూల్ బుక్స్ యూనిఫా
మ్ లు కొనాలనే రూల్ బంద్ చేయాలి.
హన్మకొండ, నేటిధాత్రి:
ప్రైవేట్ స్కూల్లో, కాలేజీల్లో చదువుకునే పేద మధ్య తరగతి విద్యార్థులకు అధిక ఫీజుల నుంచి మరియు ఆయా స్కూల్లోనే పుస్తకాలు కొనాలనే ప్రైవేట్ స్కూల్ల కార్పొరేట్ దందా నుంచి విముక్తి కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి కి విజ్ఞప్తి చేస్తూ ప్రస్తుతం జరుగుతున్న క్యాబినెట్ సమావేశాల్లో తీర్మానం చేసి విద్యా హక్కు చట్టం ప్రకారం 25% పేద విద్యార్థులకు ఫ్రీగా చదువుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
