దాహార్తిని తీర్చడానికి చలివేద్రాలు అవసరం.

దాహార్తిని తీర్చడానికి చలివేద్రాలు అవసరం.

దుర్గా ఫర్టిలైజర్స్ ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

వేసవి కాలంలో ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజలు,బాటసారుల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని గ్రామ పంచాయితీ కార్యదర్శి శ్రావణకుమారి అన్నారు.నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో మంగళవారం దుర్గా ఫర్టిలైజర్స్ యజమాని వరంగంటి ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేయగా పంచాయితీ కార్యదర్శి శ్రావణకుమారి దాత ప్రవీణ్ రెడ్డితో కలిసి ప్రారంభం చేశారు.

quench thirst.

ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ అవసరానికి అనుగుణంగా నీటిని వృదా చేయకుండా వాడుకోవాలని సూచించారు.ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటుకు దుర్గా ఫర్టిలైజర్స్ యజమాని సహకరించడం అభినందనీయం అని పేర్కొన్నారు.గ్రామంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రజలు,బాటసారులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు,మాజీ వార్డు సభ్యులు ఉప్పుల రాజు,గ్రామస్తులు భాసబోయిన రాజు,బయ్య నవీన్,రాజు,సయ్యద్ అజార్,ఉప్పుల రవి,శ్రీనివాస్, తిరుపతి రెడ్డి గ్రామ పంచాయితీ సిబ్బంది సుధాకర్,సురేందర్,ఎల్లయ్య,మహిళలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version