మృతుల కుటుంబాలను పరామర్శించిన చల్లా ధర్మారెడ్డి
పరకాల,నేటిధాత్రి
మండలం మల్లక్కపేట గ్రామాలలో ఇటీవలే మృతిచెందిన బిఆర్ఎస్ నాయకులు సాదు రాములు,రాసమల్ల సురేందర్ కుటుంబాలను పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు.ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబసభ్యులను ఓదార్చారు.అనంతరం వారి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.బాధిత కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
