Dairy Welfare Aid for Marriage in Desayipalli
కరీంనగర్ పాల డేయిరి ఆధ్వర్యంలో పుస్తె మట్టెలు అందజేత….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండలం దేశాయి పల్లె గ్రామంలో. పెళ్లి జరుగుతున్న కుటుంబానికి పుస్తె.మట్టలు అందజేసిన. అందజేసిన కరీంనగర్ డేయిరిపాలకేంద్రం. ఈ సందర్భంగా. నేరెళ్ల రూట్ సూపర్వైజర్ ఉమ్మారెడ్డి భానుచందర్ రెడ్డి మాట్లాడుతూ. కరీంనగర్ పాల డైరీ కేంద్రం ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని అందులో భాగంగానే కళ్యాణమస్తు పథకం చేపట్టిందని దానిలో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం దేశాయి పల్లె గ్రామంలోని పాడి రైతు పెండ్యాల దేవి రెడ్డి. జయ.ల కూతురు. రమ్య వివాహానికి. ఆడబిడ్డ పెళ్లికి కరీంనగర్.డేయిరీ. పాల ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో పుస్తె మట్టలు అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. దేశాయి పల్లె పాల ఉత్పత్తిదారుల సంస్థ అధ్యక్షుడు గట్టు లక్ష్మారెడ్డి. డైరెక్టర్లు మరియు సెక్రటరీ గోపన్న గారి హరీష్. కుటుంబ సభ్యులు పాల ఉత్పత్తిదారులు తదితరులు పాల్గొన్నారు
