కుక్కల దాడుల్లో మరణించిన 20 మేకలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ శాసనసభ పరిది కోహిర్ మండలంలోని గురుజువడ గ్రామంలో ముజఫర్ పటేల్ రైతుకు చెందిన మేకలపై కుక్కల దాడులతో 20 మేకలు మరణించాయని గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆర్థికంగా పెద్దఎత్తున నష్టం జరిగిందని, తమకు ప్రభుత్వం మానవతా దృక్పథంతో అదుకొని తమ బతుకుదేరువైన మేకల కోసం ఆర్థికంగా ఆదుకుంటూ తమకు భరోసా కల్పించాలని కోరుతున్నారు. కుక్కల దాడుల్లో 20 మేకలు మృతి చెందగా, మరో 5 మేకలకు గాయలయ్యాయని రైతులు తెలిపారు.