ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేపట్టాలి..
హౌసింగ్ ఏఈ అభినయ్ గౌడ్.
కేసముద్రం/ నేటి ధాత్రి
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని హౌసింగ్ ఏఈ బొమ్మగాని అభినయ్ గౌడ్ అన్నారు. శుక్రవారం పెనుగొండ గ్రామంలోని రైతు వేదికలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు మంజూరి పత్రాలు వచ్చినటువంటి వారు మాత్రమే ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించాలని, ప్లానింగ్ ముగ్గు పోసిన అనంతరం గ్రామంలోని కార్యదర్శి ద్వారా ఫోటోను యాప్ లో అప్లోడ్ చేయడం జరుగుతుందని ప్రభుత్వ నిబంధనల ప్రకారం 400పీట్ల నుండి 600 ఫీట్ల లోపు మాత్రమే ఇంటి నిర్మాణం చేపట్టాలని, ఇంటి నిర్మాణ లబ్ధిదారులకు ఉచిత ఇసుక కూపన్లు మంజూరు చేయబడతాయని ఎటువంటి రుసుములు లేకుండా పూర్తిగా ఉచితంగా 8 ట్రాక్టర్లు అందజేయడం జరుగుతుందన్నారు. 150 బస్తాల సిమెంటు, 8 క్వింటాల స్టీల్ (సలాక), 20 ఎంఎం కంకర నాలుగు ట్రాక్టర్లు, 40 ఎంఎం కంకర రెండు ట్రాక్టర్లు, బేసుమెంటు రాయి మూడు ట్రాక్టర్లు , సిమెంట్ ఇటుకలు 2,150 లతో నిర్మాణం చేయాలని తప్పనిసరిగా గృహ నిర్మాణంలో టాయిలెట్ నిర్మాణం చేపట్టాలని, మేస్త్రీలు గోడ కొలతల ప్రకారం చదరపు అడుగుకి 300 చొప్పున మాత్రమే తీసుకోవాలని,ప్రభుత్వ నిబంధనలు ప్రకారమే నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు.