యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా ఉత్తమ వ్యాసరచన పోటీ విద్యార్థులకు ప్రశంస పత్రాలు
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ వారు నిర్వహించిన యాంటీ డ్రగ్స్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వ్యాస రచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు విజేతలుగా నిలిచిన పదవతరగతి చదువుతున్న సిరి కి డ్రాయింగ్ లో మొదటి బహుమతి, వ్యాస రచనలో లక్ష్య మొదటి బహుమతి గా మెడల్,సర్టిఫికెట్ జిల్లా కలెక్టర్ సందీప్ ఝా బహుమతి ప్రదానం చేశారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు L. శారద, ఉపాధ్యాయులు ఎలగొండ రవి,రమేష్ బాబు సతీష్ బాబు,రాజలింగం, రజని మరియు ఉపాధ్యాయ బృందం అభినందలను తెలియజేశారు.