మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన ర్యాలీ

మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన ర్యాలీ నిర్వహించిన తొర్రూరు డి.ఎస్.పి కృష్ణ కిషోర్

యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా సన్మార్గంలో నడవాలని తొర్రూరు డీ ఎస్పీ క్రిష్ణ కిషోర్ యువతకు విజ్ఞప్తి చేశారు.

తొర్రూర్ డివిజన్ నేటి ధాత్రి

 

 

 

అంతర్జాతీయ మాధికద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో మాధక ద్రవ్యాల  నిర్మూలన పై అవగాహన ర్యాలీ ని తొర్రూరు డీఎస్పీ కిష్ణ కిషోర్ ప్రారంభించారు …ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ….యువత మత్తులో చిత్తవుతున్నారని…మాదకద్రవ్యాలనువిక్రయించినా, రవాణా చేసినా, వినియోగించినా 1908 గాని పోలీసులకు గాని సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని మాదకద్రవ్యాల అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా  అవగాహన పెంపొందించేందుకు పోలీసులు పలు అవగాహన కర్యక్రమాలు చేపడుతున్నామన్నారు.ఈ ర్యాలీలో తొర్రూర్ తాసిల్దారు గారు సబ్ డివిజన్లోని, సీ.ఐ లు. ఎస్సైలు పోలీస్ సిబ్బంది, పలు శాఖల అధికారులు, వివిధ పాఠశాలల  విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!