మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి.

మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి…

మహబూబాబాద్/ నేటి దాత్రి

 

 

నేటి యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని నెల్లికుదురు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, ఏఎస్ఐ వెంకటరెడ్డి లు అన్నారు. గురువారం అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎన్ఎస్ఎస్ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల దుర్వినియోగంపై విద్యార్థులకు అవగాహన సదస్స నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతను పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య డ్రగ్స్‌ అని, మత్తు బారి నుంచి యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని అన్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడితే బయటకు రావడం కష్టమని తెలిపారు. యువత మత్తు సేవించి తమ శరీరాన్ని అనారోగ్యం పాలు చేసుకుంటున్నారన్నారు. అనంతరం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మర్సకట్ల అనిల్ కుమార్ మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సమాజపరంగా తీవ్ర ప్రభావం చూపిస్తుందని, డ్రగ్స్‌కు బానిసైన వారి కోసం ప్రభుత్వం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. డ్రగ్స్‌కు సంబంధించి సమాచారం తెలిసిన వెంటనే టోల్‌ ఫ్రీ నెంబర్‌ 100 లేదా 14446 కు సమాచారం అందించాలని సూచించారు. అలాగే యువజన సంఘాలు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, ప్రజా ప్రతినిధులు మహబూబాద్ జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా చేయడంలో కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ప్రకాష్ బాబు, కవిరాజు, శ్రీనివాస్, బాబు, సతీష్, మహేందర్, నాగేశ్వరావు, సుధాకర్, యాకన్న, వెంకటేశ్వర్లు, రామ్మూర్తి, సుభాష్ అధ్యాపకేతర బృందం ప్రదీప్, లక్ష్మణ్, గౌరీ శంకర్ పోలీస్ సిబ్బంది లింగన్న, సుధీర్,
తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!