మాదకద్రవ్యాల నియంత్రణ పై విద్యార్థులకు !

మాదకద్రవ్యాల నియంత్రణ పై విద్యార్థులకు న్యాయ అవగాహన కార్యక్రమం

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ శ్రీమతి.పి.నీరజ ఆదేశాల మేరకు 26 జూన్ 2025 రోజున (ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం) సందర్భంగా రాధిక జైస్వాల్ సీనియర్ సివిల్ జడ్జి కం సెక్రటరీ, జిల్లా న్యాయ సేవాదికర సంస్థ సిరిసిల్ల పట్టణంలోని నెహ్రునగర్ లో గల జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది.

 

 

 

మత్తు పదార్థాల వాడకం ద్వారా ఏర్పడు అనర్థాల గురించి మత్తు ద్వారా చేస్తున్న తప్పులు అటువంటి తప్పులకు పడేటటువంటి శిక్షల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల న్యాయవాద సంఘం అధ్యక్షులు జూపల్లి శ్రీనివాసరావు, లోక్ అదాలత్ సభ్యులు చింతోజు భాస్కర్, ఆడెపు వేణు, సైకియాట్రిస్ట్ డాక్టర్ ప్రవీణ్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ మల్లేష్ యాదవ్, రిజర్వ్ ఎస్సై సాయికిరణ్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి,నాగుల భాగ్యరేఖ, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!