గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ.
బాలానగర్ /నేటి ధాత్రి :
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని బిల్డింగ్ తండా గ్రామంలో MGNREGS నిధుల కింద మంజూరైన రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించనున్న గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి గురువారం భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. “ప్రతి గ్రామానికి పంచాయతీ భవనం ఒక కేంద్ర బిందువుగా ఉంటుందని, గ్రామపంచాయతీ భవనం గ్రామ అభివృద్ధి ప్రజల అవసరాలను తీర్చే దిశగా గ్రామపంచాయతీ కార్యాలయం ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం గ్రామస్థాయిలో మౌలిక వసతుల కల్పనతో గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేయడమే.ఇప్పటికే ఎన్నో గ్రామాల్లో పంచాయతీ భవనాలు నిర్మించామన్నారు. బిల్డింగ్ తండా గ్రామపంచాయతీ భవనాన్ని త్వరితగతిన పూర్తి చేసి ప్రజల సేవలోకి తీసుకురావాలని కోరుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్, దత్తాత్రేయ, తిరుపతి, కె.ఎస్.ఆర్ వెంకట్ రెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు.