
Singareni High School
గంజాయి నియంత్రణ పై అవగాహన సదస్సు
మందమర్రి నేటి ధాత్రి :
మందమర్రి పట్టణం సింగరేణి హై స్కూల్ గ్రౌండ్లో విద్యార్థినీ విద్యార్థులకు మందమర్రి పోలీస్ అధికారులు గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపై తల్లిదండ్రులు ఎక్కువగా శ్రద్ధ తీసుకొని పిల్లల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని తల్లిదండ్రుల పిల్లలకు సూచించారు గంజాయి మత్తులో పడి పిల్లలు వాళ్ళ భవిష్యత్తును కోల్పోతున్నారు ఇటువంటి అరాచకాల్ని అరికట్టడానికి మేము శాశ్వత ప్రయత్నం చేస్తున్నాము మీరు కూడా మాకు సహకరించాలని తల్లిదండ్రులను కోరడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమానికి బెల్లంపల్లి ఏసిపి, సింగరేణి జిఎం, లైన్స్ క్లబ్ సభ్యులు, వివిధ పార్టీ నాయకులు హాజరు కావడం జరిగింది.