ప్రైవేట్ పాఠశాలను తలపిస్తున్న సర్కార్ బడి
ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి
ఇబ్రహీంపట్నం మండలంలోని వర్ష కొండ గ్రామంలో మండల్ పరిషత్ పాఠశాల గత ఏడాది జూన్ నెలలో 20. మంది పిల్లలతో ఉన్న బడి ఈ సంవత్సరం 70.విద్యార్థులతో ప్రవేట్ పాఠశాలకు దీటుగా కేవలం ఒక సంవత్సరంలో పాఠశాలక మారిపోయింది ప్రమోషన్ ద్వారా ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు స్వీకరించిన అచ్చ విజయ్ భాస్కర్ కేవలం సంవత్సర కాలంలోనే పూర్తిగా మార్చుకున్నారు దీని కొరకు గ్రామంలో ఇంటింటికి తిరిగి పిల్లల తల్లిదండ్రులకు నమ్మకం కలిగించేట్లు భరోసా ఇవ్వగలిగాడు వెంటనే గ్రామ పెద్దలను కలిసి బడికి కావలసిన అవసరాలపై చర్చించి ఒక్కొక్కటిగా రాబట్టుకునే ప్రయత్నం చేశాడు మొదట గ్రామ ఎంపీటీసీ పోనుకంటి చిన్న వెంకట్ పిల్లలకు టై. బెల్ట్. ఐడి కార్డు ఇచ్చారు తరగతి లో పాఠ్యాంశ బోధనకు గ్రామంలోకి తీసుకుపోయే విధంగా యూట్యూబ్ ఛానల్ లలో ఏర్పాటు చేశారు తద్వారా బడిని గ్రామానికి అనుసంధానం చేయడంలో సఫలం అయ్యారు అంతటితో ఆగకుండా గ్రామంలోని పెద్దలను. మరియు యువతను సభ్యులుగా చేస్తూ ఒక వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసి బడిలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని గ్రామంలోకి తీసుకువెళ్లారు దీనితో బడి వైపు దాతలు ముందుకు వచ్చారు జియో ఫైబర్.
బడికి అవసరం కొరకు ప్రింటర్ మరియు బడి రక్షణ కొరకై సీసీ కెమెరాలు దాతల సహకారంతో ఏర్పాటు చేశారు ఈ దశలో దుబాయిలో ఉండే గ్రామ నివాసి మంగలి పెళ్లి మహిపాల్.

దృష్టికి తీసుకువెళ్లారు బడి డెవలప్మెంట్ కోసం ఏమన్నా సహాయం చేయాలని కోరారు అతను వెంటనే స్పందించి బడికి టాయిలెట్స్ రిపేరు మరియు రన్నింగ్ వాటర్ కొరకు 110.000లక్ష పది రూపాయలు మరియు అంతేకాకుండా మరమూర్తులకు బడి ప్రైవేట్ పాఠశాల లాగా కనపడే విధంగా 90 వేల రూపాయలతో పెయింటింగ్. మరియు పిల్లలకు ఆడుకునేటట్లు పాట వస్తువులకు 80000 రూపాయలతో పాటవస్తులు ఏర్పాటు చేశారు ప్రజల ఉపాధ్యాయుల గదిలో 5000 రూపాయలతో దేశ నాయకుల ఫోటోలు ఏర్పాటు చేశారు అలాగే బడి వార్షికోత్సవ కార్యక్రమానికి పదిహేడు వేల రూపాయలు ఇచ్చారు మొత్తం కలిపి 300000 రూపాయలు తన సొంత డబ్బులతో పాఠశాలకు ఖర్చు చేశారు సొంత గ్రామ బడిని నిలబెట్టిన మంగలి పెళ్లి మహిపాల్ గ్రామస్తులు అభినందించారు లో ఉండేది మనుగడే ప్రశ్నార్థకంగా ఉన్నప్పటి పరిస్థితుల నుండి ఈ సంవత్సరం 70 మంది విద్యార్థులతో ప్రైవేట్ పాఠశాలకు దీటుగా కేవలం ఒక సంవత్సరంలోనే పాఠశాల మారిపోయింది