జహీరాబాద్ బ్రిడ్జి పైన ఆక్సిడెంట్ కి గురైన ఖాజా కుటుంబానికి సహాయం.

Accident Accident

జహీరాబాద్ బ్రిడ్జి పైన ఆక్సిడెంట్ కి గురైన ఖాజా కుటుంబానికి సహాయం చేసిన – జేపీ చారిటబుల్ అండ్ వెల్ఫేర్ ట్రస్ట్ ఫౌండర్ జ్యోతి పండాల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కొన్ని రోజుల క్రితం కొత్తగా నిర్మించిన జహీరాబాద్ బ్రిడ్జి పైన ఆక్సిడెంట్ కి గురైన ఖాజా గారి కుటుంబానికి సహాయం చేయగలరని జ్యోతి పండాల్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే, ఖాజా గారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో యాక్సిడెంట్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

Accident
అలాగే వారి కుటుంబం అంతా కూడా ఖాజా గారి సంపాదన పైన ఆధారపడి ఉన్నారు కాబట్టి వారికి ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు ఉండటం వల్ల రేషన్ కి కూడా చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని తెలిసి కాజా గారి ఇంటికి వెళ్లి బియ్యము, బ్లాంకెట్స్ మరియు పిల్లలకి బట్టలు అందజేయడం జరిగింది. అలాగే వారికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా తనకు కాల్ చేయమని జ్యోతి పండాల్ వారికి తెలియజేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!