భూభారతి రెవెన్యూ సదస్సులో పాల్గొన్న.

AMC Chairman Raji Reddy AMC Chairman Raji Reddy

భూభారతి రెవెన్యూ సదస్సులో పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ రాజిరెడ్డి

పరకాల నేటిధాత్రి

 

shine junior college
shine junior college

 

రైతుల సంక్షేమం కోసం రాష్ట ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి కార్యక్రమంలో భాగంగా పరకాల పట్టణంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సన్నచిన్నకారు రైతులను ద్రృష్టిలో ఉంచుకొని,రైతులకు హక్కులు కల్పించాలనే ఉధ్ధేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లు నూతన భూ భారతి చట్టం తీసుకు రావడం జరిగిందన్నారు.తరాలుగా సాగు చేసుకుంటూ పట్టాలు లేని రైతులందరికి ప్రజా ప్రభుత్వం సమగ్రంగా సర్వే నిర్వహించి పట్టాలు ఇవ్వబోతుందని,గత ప్రభుత్వ హయంలో రైతులందరికి సబ్సిడిలను ఇవ్వకుండా మోసం చేసిందని,ప్రజా ప్రభుత్వం రైతుల మేలుతో పాటు ప్రతి రైతు శ్రేయస్సు కు కృషి చేస్తుందని ప్రజల కోసం పరితపించే ప్రజా ప్రభుత్వానికి అండగా నిలువాలని కోరారు.ఈ కార్యక్రమంలో పరకాల తహసిల్దార్ విజయలక్ష్మి,రెవెన్యూ సిబ్బంది,మార్కెట్ కమిటీ డైరెక్టర్స్,కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీనాయకులు,కార్యకర్తలు,స్ధానిక రైతులు తదితరులు పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!