టెక్స్టైల్స్ పార్క్ యజమానులతో సమావేశం.

Park Park

టెక్స్టైల్స్ పార్క్ యజమానులతో సమావేశం…

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

shine junior college
shine junior college

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని టెక్స్టైల్స్ పార్క్ యజమానులతో చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అనంతరం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం మినీ సమావేశ మందిరంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా టెక్స్టైల్స్ పార్క్ యజమానులు తమకు ప్రభుత్వం నుంచి మరిన్ని వస్త్రం ఉత్పత్తి ఆర్డర్లు ముందస్తుగా ఇవ్వాలని, తమ సమస్యలు పరిష్కరించాలని.

park
park

చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్ ను కోరారు. వివిధ శాఖలకు అవసరమైన ఆర్డర్స్ అందజేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం నాణ్యతతో వస్త్రాలు ఉత్పత్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూప రెడ్డి, చేనేత జౌళి శాఖ జేడీ ఎన్ వెంకటేశ్వర్ రావు, ఏడీ రాఘవరావు, వివిధ మ్యాక్స్ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు యజమానులు ఆసాములు, టెక్స్టైల్స్ పార్క్ యజమానుల సంఘం అధ్యక్షుడు అన్నల్ దాస్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!