గుండె గుడిలో ఇందిరమ్మ గూడు.

`శీనన్న చొరవతో పేదవారి ఇంటి కలకు మోక్షం.

`రేవంత్‌ సర్కారులో పల్లెకు కొత్త దనం.

`తెలంగాణకు సరికొత్త నిండుదనం.

`తెలంగాణ పల్లెల్లో ఇందిరమ్మ సంబురం!

`శీనన్న చొరవతో పేద వారి ఇంటి కలకు మోక్షం.

`ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల పండుగ

`పేదలందరి ఇందిరమ్మ ఇళ్ల మంజూరుతో గుండె గుడిలో వేడుక.

`ఇప్పటికే మొదలైన ఇండ్ల నిర్మాణం.

`పేదవారి కళ్లలో ఆనందం.

`పదేళ్ల ఎదురుచూపులకు మోక్షం.

`గతంలో పదేళ్ల కాంగ్రెస్‌ లోనే ఇందిరమ్మ ఇల్లు సొంతం.

`పదేళ్ల బిఆర్‌ఎస్‌ కాలమంతా ఆశల మేఘం.

`ఇప్పుడు మళ్ళీ పల్లెల్లో మళ్ళీ ఆనాటి వాతావరణం.

`పేదలందరికీ కాంగ్రెస్‌ అందిస్తున్న వరం.

`జీవిత కాలం గుర్తుండిపోయేలా ఇందిరమ్మ గూడు నిర్మాణం

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తెలంగాణ పల్లెల్లో పదేళ్ల తర్వాత ఇందిరమ్మ ఇండ్ల వేడుక మొదలైంది. పల్లె సంబురపడుతోంది. దశబ్ధానికి పైగా ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని ప్రజలు సంతోషపడుతున్నారు. పదేళ్లపాలు రెండు పడకల గదులు ఇల్లు అంటూ ఊరించి, ఊరించి బిఆర్‌ఎస్‌ ఉసూరుమనిపించింది. ఎన్నికలెప్పుడొచ్చినా రెండు పడకల ఇల్లు ముచ్చట చెప్పుడు తప్ప తీర్చింది లేదు. పదేళ్లలో ఒక్క ఇల్లు కూడా కేసిఆర్‌ ఇచ్చింది లేదు. ఎన్నొన్నో చెప్పాడు. ఆఖరుకు కేసిఆర్‌ చేతులెత్తేశాడు. మాయ మాటలు చెప్పి ఓట్ల మూటలు కొల్లగొట్టుకొని పదేళ్లు పాలించి, పట్టుమని పది ఇండ్లుకూడా ఇవ్వలేదు. కాని కాంగ్రెస్‌ పార్టీ మాటంటే మాటే. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కాంగ్రెస్సే. సొంత ఇల్లు అనేది అందిరకీ కల. నిన్నటి తరం వరకు పల్లెల్లో అందరికీ ఇండ్లు వుండేవి. కాని తరం మారుతున్న కొద్ది ఆ ఇండ్లు పాతబడిపోవడం. కూలిపోవడం జరుగుతోంది. పైగా పెరుగుతున్న జనాభాతో కుటుంబాలు పెరుగుతూ వచ్చాయి. కుటుంబ సభ్యులు పెరుగుతుండడంతో ఇండ్ల అవసరం పెరుగుతూ వచ్చింది. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని పెద్దలు ఎందుకన్నారో గాని, ఆ సామెత ఇప్పటి రోజులకు సరిగ్గా సరిపోతోంది. గత యాభైఏళ్ల క్రితం వరకు ఎంతటి పేదవారైనా సరే ఏదో ఒక గుడిసె వేసుకొని బతికేవారు. కాని ఈ రోజుల్లో గుడిసే వేసుకునేందుకు స్ధలం లేదు. కట్టుకునే స్ధోమత లేదు. దాంతో ప్రభుత్వం ఎప్పుడు ఇల్లు ఇస్తుందా? అని ఎదురుచూసే రోజులు వచ్చాయి. పేదలు మరింతగా ప్రభుత్వం మీద ఆధారపడి ఇల్లు కట్టుకునే స్ధితికి చేరింది. అందుకే తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్లు అనే పేరు వినిపిస్తేనే పేదల కళ్లలో ఆనందం నిండుతుంది. ఇక మంజూరైన వారి ఆనందానికి అవదులు వుండవు. కాంగ్రెస్‌ అంటేనే పేదల రాజ్యం. ఇందిరమ్మ రాజ్యమని దేశమంతా అందుకే ఇప్పటికీ ప్రజలు కొనియాడుతుంటారు. ముఖ్యంగా మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ ప్రధాని కావడం వల్ల పేదలుకు ఎంతో మేలు జరిగింది. పేదలను ఒక స్దాయికి తీసుకురావాలన్న ప్రగతికి బాటలు పడిరది. ఎస్సీ, ఎస్టీల జీవితాల్లో వెలుగులు నింపడం మొదలైంది. అయితే అభివృద్ది అనేది నిరంతర ప్రక్రియ. ఒక్కసారి మొదలైందంటే అది నిరంతర ప్రవాహంగా సాగాల్సిందే. ఒకప్పుడు దేశంలోని భూములున్నీ అగ్రవర్ణాల చేతుల్లో వుండేవి. ప్రభుత్వం ఆదీనంలో వుండేవి. వాటన్నింటిలో నూటికి తొంబైశాతం మేర ఆ రోజుల్లోనే ఎస్సీ, ఎస్టీలు ఇందిరాగాంధీ భూములు పంచారు. ఆ భూములను సాగుయోగ్యం చేశారు. ఎస్సీ, ఎస్టీలకు భూముల ఇవ్వడమే కాకుండా, వాటిని సాగుయోగ్యం కోసం పక్క బావులు తివ్వించారు. అలాంటి బావులు ఇప్పుడు తవ్వించాలంటే లక్షల రూపాయలు ఖర్చవుతుంది. అయినా ఆరోజుల్లో ఎంతటి ఖర్చుకైనా వెనుకాడకుండా ఎస్సీ, ఎస్టీలకు భూముల ఇవ్వడమే కాకుండా, బావులు తొవ్వించి రైతులను చేశారు. కుల వృత్తులకు పరిమితైన ఆ వర్గాలను రైతులను చేసిన ఘనత ఇందిరాగాంధీకే దక్కుతుంది. అంతే కాకుండా దేశంలోని ప్రతి పల్లెలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం అప్పుడే మొదలైంది. అలా దేశంలో కొన్ని కోట్ల మందికి ఇండ్లు నిర్మాణం చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీ వల్లనే సాధ్యమైంది. పల్లె పట్టణాలు అనే తేడాలేకుండా గర్‌ కుల్‌ అనే కాలనీలు పెద్దఎత్తున వెలిసిన రోజలవి. తర్వాత కూడా కాంగ్రెస్‌ పార్టీ హయాంలోనే దేశంలోని అనేక పట్టణాలల్లో పెద్దఎత్తున ఇండ్ల నిర్మాణం చేసి, ప్రజలకు నీడ కల్పించారు. తెలంగాణ విషయానికి వస్తే ఉమ్మడిరాష్ట్రంలో 2004 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్‌ పార్టీ పదేళ్ల కాలంలో అటు రైతులకు, ఇటు పేదలకు అనేక రకాలమేలు చేశారు. అర్హలైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను అందించారు. ప్రతి ఊరిలోనూ, పట్టణాల్లోనూ ప్రభుత్వ భూములనే సేకరించి, ప్రజల చేతికి రూపాయి ఖర్చు లేకుండా, ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేశారు. ప్రతి పల్లెల్లో కనీసం 50 నుంచి వందకు తక్కువ కాకుండా ఇందిరమ్మ కాలనీలు వచ్చాయి. ప్రతి పట్టణంలో వేలాది ఇండ్లు ఇచ్చారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇందిరమ్మ ఇండ్ల కాలనీలు అనేకం వున్నాయి. అంతే కాకుండా ప్రజలు ఉపాధి హమీ అమలు చేసి, ఆర్ధిక ప్రగతికి తోడ్పాటు కల్పించారు. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇవ్వనటు వంటి పధకం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎలాగైనా అధికారం దక్కించుకోవాలన్న ఆలోచనతో కేసిఆర్‌ రెండు పడకల గదుల ఇండ్లు అనికొత్త ప్రచారం మొదలుపెట్టారు. ప్రభుత్వం తల్చుకుంటే ఇవ్వడం పెద్ద సమస్య కాదని ఇందిరమ్మ ఇండ్ల ద్వారా రుజువైంది. అందుకే తెలంగాణ ప్రజలు బిఆర్‌ఎస్‌ను నమ్మారు. అదే సమయంలో కాంగ్రెస్‌పార్టీనే గెలిపిస్తే ఇప్పటి వరకు మరో ఇరవై లక్షల ఇండ్లకు పైగా నిర్మాణం జరిగేవేమో? కేసిఆర్‌ అధికారంలోకి రాగానే ఉమ్మడి రాష్ట్రంలో వున్న గృహ నిర్మాణ శాఖను రద్దు చేసినప్పుడే కేసిఆర్‌ నైజం బైట పడిరది. డబుల్‌ బెడ్‌ రూంల ఇండ్లు అనేవి మిధ్యఅనేది తేలిపోయింది. కాని జనం కేసిఆర్‌ ఇస్తారన్న నమ్మకాన్ని రెండోసారి కూడా పెట్టుకున్నారు. కాని కేసిఆర్‌ ఇండ్లు ఇవ్వడానికి సుముఖతచూపలేదు. డబుల్‌ బెడ్‌ రూంలు ఇవ్వలేదు. డబుల్‌ బెడ్‌ రూంలు ఇస్తామని నమ్మించి, గృహనిర్మాణ శాఖను వదిలించుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని చెప్పి ఆ శాఖను మూసేయించారు. దాని మనుగడ లేకుండా చేశారు. ఈ వాదన ఉమ్మడి రాష్ట్రంలోనే మొదలైంది. ఆ సమయంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఒక పెద్ద కార్యక్రమం జరిగినప్పుడు చిన్న పొరపాట్లు జరిగడం సహజం. అయినా ఎలుకల బాధకు ఇల్లు తగలబెట్టుకుంటామా? అని కూడా అన్నారు. అర్హులైన పేదలందరికీ ఇండ్లు ఇవ్వాలన్నదే కాంగ్రెస్‌ లక్ష్యమని చెప్పి, అప్పటి ప్రతిపక్షాల నోరు మూయించారు. ఉమ్మడి రాష్ట్రంలో అందరికీ ఇండ్లు ఇచ్చారు. కాని బిఆర్‌ఎస్‌కు సాద్యం కాలేదు. ఇవ్వాలన్న మనసు కేసిఆర్‌కు రాలేదు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌ అదికారంలోకి వచ్చింది. గతంలో కాంగ్రెస్‌ హయాంలో కనిపించిన పండుగ మళ్లీ మొదలైంది. పల్లెల్లో పెద్దఎత్తున పండుగ వాతారణం కనిపిస్తోంది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. ఎక్కడిక్కడ ఇందిరమ్మ ఇండ్ల నిర్మానం మొదలైంది. త్వరలోనే ఆ ఇండ్లు పూర్తయ్యే దశకు చేరుకుంటున్నాయి. ప్రస్తుతంవున్న పరిస్ధితుల్లో ఊరుకి పది ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినా లక్షల ఇండ్లు అవుతాయి. తెలంగాణలో సుమారు 14వేల గ్రామాలున్నాయి. పట్టణాలు 600లకు పైగా వున్నాయి. పల్లెలు పట్టణాలన్నీ కలిపితే కనీసం రెండు లక్షలకు పైగా ఇండ్లు ఏక కాలంలో పూర్తయ్యే అవకాశం వుంది. ఇంకా మూడేళ్ల కాలం ముందుంది. వచ్చే ఏడాది నుంచి పూర్తి స్దాయిలో ఇందిరమ్మ ఇండ్ల పధకం అమలు జరిగితే మూడేళ్లలో కనీసం 15లక్షలకు పైగా ఇండ్లు నిర్మాణం జరగొచ్చని అంచనా. తొలి దఫాలో ఇందిరమ్మ ఇండ్లు దక్కని వారికి మిగిలిన విడతల్లో తప్పకుండా అందే అవకాశం వుంది. ప్రతి పల్లెలోనూ కనీసం రెండు నుంచి మూడు వందల కొత్త ఇండ్లు నిర్మాణం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదంతా కాంగ్రెస్‌ ప్రభుత్వం వల్లనే సాద్యమని మరోసారి రుజువైంది. ఎన్నికల ముందు కాంగ్రెస్‌ ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిపిసి. అధ్యక్షుడుగా ప్రజలకు హమీ ఇచ్చారు. అదికారంలోకి వచ్చిన తర్వాత రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఎంతో పట్టుదలతో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన అంశమేమిటంటే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లు గత ఏడాదినుంచే మొదలయ్యాయి. ఆ ఖమ్మం నియోజకవర్గంలో ఎప్పుడో ఇందిరమ్మ ఇండ్లు వెలిశాయి. ఇది మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి నాయకత్వ నిబద్దతకు నిరద్శనమని చెప్పొలి. పైలెట్‌ ప్రాజెక్టు కింద మొదలైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రతినియోజకవర్గంలో ఊపందుకున్నాయి. నియోజకవర్గానికి సుమారు 4వేల ఇండ్ల నిర్మాణం మొదలైంది. మరో రెండు నెలల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తయి, ప్రజలు గృహ ప్రవేశాలు చేసుకునే సమయంకూడా ఆసన్నమౌతోంది. నిజంగా తెలంగాణకు ఇది అసలైన పండుగ చెప్పకతప్పదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!