జర్నలిస్టుల భద్రతే టీయూడబ్ల్యూజే(ఐజేయు) ధ్యేయం
మెట్ పల్లి జూన్ 4 నేటి ధాత్రి
ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ఇన్సూరెన్స్ పాలసీలు ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు బూరం సంజీవ్, మహమ్మద్ అజీమ్
మెట్ పల్లి జర్నలిస్టుల భద్రతే టీయూడబ్ల్యూజే(ఐజేయు) ధ్యేయం అని జర్నలిస్టుల భద్రత కొరకే ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ఇన్సూరెన్స్ పాలసీలు చేస్తున్నామని ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు బూరం సంజీవ్, మహమ్మద్ అజీమ్ అన్నారు.
ప్రతినెలా నాలుగవ తారీఖున జరిగే సాధారణ సమావేశం బుధవారం రోజున ప్రెస్ క్లబ్ కార్యాలయంలో నిర్వహించారు.ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు బూరం సంజీవ్ మహ్మద్ అజీమ్ లు మాట్లాడుతూప్రెస్ క్లబ్ సభ్యుల ప్రయోజనాల దృష్ట్యా సభ్యులందరికీ 15 లక్షల రూపాయల పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది. ఇట్టి ఇన్సూరెన్స్ లోని ప్రయోజనాలు యాక్సిడెంటల్ డెత్ కి15 లక్షలు, శాశ్వత వైకల్యం చెందిన వారికి 15 లక్షలు, పాక్షిక శాశ్వత వైకల్యం చెందిన వారికి 15 లక్షలు, అత్యవసర వైద్యానికి లక్ష రూపాయలు, విద్యా ప్రయోజనానికి లక్ష రూపాయలు, వివాహ ప్రయోజనానికి లక్ష రూపాయలు, అంత్యక్రియల ఖర్చుకు 5000 రూపాయలు, ఏదైనా ఎముకలు విరిగినప్పుడు 25 వేల రూపాయలు, కాలిన గాయాలకి 10000 రూపాయలు, పాలసీదారుడు కి హాస్పిటల్ లో రూమ్ కోసం రోజుకి 1000 రూపాయలు చొప్పున 15 రోజుల వరకు ఇవ్వడం జరుగుతుంది. ఐసీయూలో ఉన్న పేషెంట్ కోసం రూమ్ కి 2000 రూపాయల చొప్పున 15 రోజుల వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్న స్కీమ్ సభ్యులందరికీ చేయించడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బూరం సంజీవ్ జనరల్ సెక్రెటరీ మహమ్మద్ అజీమ్ ఉపాధ్యక్షులు జంగం విజయ్ సాజిద్ పాషా, గౌరవ సలహాదారులు దాసం కిషన్ ,క్యాషియర్ మక్సూద్, జాయింట్ సెక్రెటరీ పుండ్ర శశికాంత్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎండి సమీయుద్దీన్, కార్యవర్గ సభ్యులు పానుగంటి మహేందర్, కుర్ర రాజేందర్ ,యానం రాకేష్ ,రఫీ ఉల్లా, సోహెల్ , హైమద్, విజయసాగర్, సభ్యులు ఆదిల్ పాషా, ఏసవిని గణేష్ ఎండి అభిద్ తదితరులు పాల్గొన్నారు.