2005-2006 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.

Classmates Meet. Classmates Meet.

2005-2006 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

20 ఏండ్ల అనంతరం కలుసుకున్న క్లాస్ మేట్స్

తంగళ్లపల్లి టౌన్: (నేటిధాత్రి)

 

 

 

తంగళ్లపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 2005-2006 లో 10 వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం.చదివిన విద్యార్థులు 20 ఏండ్ల అనంతరం కలుసుకున్నారు. తంగళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అప్పటి ప్రధానోపాధ్యాయులు రాజి రెడ్డితో, రిటైర్డ్ ఎంఈఓ రామచంద్రరావు, ఉపాధ్యాయులు జలంధర్, రవీందర్,శ్రీధర్, లింగయ్య, బద్రుద్దీన్, శంకర్ నారాయణ, శంకరయ్య,పి.ఈ.టీ నర్సింగరావు,అంజనాదేవి ఉపాధ్యాయులను సత్కరించారు. 20 సంవత్సరాల తరువాత అనంతర పరిచయ వేదిక ఏర్పాటు చేసుకొని తాము చేస్తున్న ఉద్యోగాలు, తమ వృత్తులను పరిచయం చేసుకున్నారు. పలువురు సాప్ట్‌‌ వేర్లు, డాక్టర్లుగా, ఉపాధ్యాయలుగా, రాజకీయ నాయకులుగా స్థిరపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!