కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
పరకాల నేటిధాత్రి:
పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణానికి సంబంధించిన కల్యాణ లక్ష్మి చెక్కులను పరకాల నియోజకవర్గ శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పంపిణీ చేసారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నూతనంగా వివాహం చేసుకున్న జంటలకు కల్యాణ లక్ష్మి పథకం ఒక వరంగా ఆదుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని,పార్టీలకు అతీతంగా కల్యాణ లక్ష్మి ఇవ్వడం ఎంతో గొప్ప కార్యక్రమం అని అన్నారు.ఈ కార్యక్రమంలో పరకాల, నడికుడ మండల అధ్యక్షులు కట్కురి దేవేందర్ రెడ్డి,బుర్ర దేవేందర్ గౌడ్,శ్రీ కుంకుమేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ కొలుగురి రాజేశ్వర్ రావు, పరకాల పట్టణ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్,మాజీ ఎంపిటిసిలు,మాజీ సర్పంచ్ పర్నెం మల్లారెడ్డి,కోతపెల్లీ రవి,చాడ తిరుపతి రెడ్డి, ఎస్సీ విభాగం అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి, ఎఏంసి డైరెక్టర్ దాసరి బిక్షపతి, పరకాల పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ మంద నాగరాజు, ఏజీపీ లక్కం శంకర్,కాంగ్రెస్ నాయకులు ఎకు రవికుమార్,ఎండి షఫీ,గోవింద సురేష్ తదితరులు పాల్గొన్నారు.నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే రేవూరిపట్టణ కేంద్రంలోని ఆర్ఆర్ గార్డెన్లో నార్లపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న తాటికొండ మౌనిక వివాహనికి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పరకాల,నడికుడ మండల అధ్యక్షులు కట్కురి దేవేందర్ రెడ్డి,బుర్ర దేవేందర్ గౌడ్, పరకాల పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్,శ్రీ కుంకుమేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ కొలుగురి రాజేశ్వర్ రావు,మాజీ ఎంపిటిసిలు, మాజీ సర్పంచ్ పర్నెం మల్లారెడ్డి,కోతపెల్లీ రవి,చాడ తిరుపతి రెడ్డి,ఎస్సీ విభాగం అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి,ఎఏంసి డైరెక్టర్ దాసరి బిక్షపతి,పరకాల పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ మంద నాగరాజు,ఏజీపీ లక్కం శంకర్,కాంగ్రెస్ నాయకులు ఎకు రవికుమార్,ఎండి షఫీ,గోవింద సురేష్, తదితరులు పాల్గొన్నారు.