‘తాళం విరగొట్టి నగదు దోచుకెళ్ళారు’
బాలానగర్ నేటి ధాత్రి:
అర్థరాత్రి వేళలో.. ఎవరూ లేని సమయంలో.. బాలానగర్ పోస్ట్ ఆఫీస్ కార్యాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి శనివారం అర్ధరాత్రి నగదును దోచుకెళ్ళారు. ఎస్సై లెనిన్ వివరాల ప్రకారం.. ఈనెల 24వ తేదీన పోస్ట్ ఆఫీస్ ఉద్యోగులు తాళం వేసి ఇంటికి వెళ్లారు. అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పోస్ట్ కార్యాలయం వెనుక భాగంలో తాళం విరగొట్టి లోపలికి ప్రవేశించారు. కార్యాలయంలో పలు డాక్యుమెంట్స్ లు చిందరవందరగా పడేసి.

రెండు లాకర్లలో ఉన్న సుమారు రూ. 30,740 వేల నగదును దోచుకెళ్ళారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఎవరూ చూడలేదు. సోమవారం స్వీపర్ కార్యాలయం శుభ్రం చేస్తుండగా.. విరిగిపోయిన తాళం చూసి అధికారులకు పోస్ట్ ఆఫీస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు ఎస్సైకి సమాచారం ఇవ్వగా.. ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. రాత్రి వేళలో పోలీస్ నిగా పెట్టి దొంగతనాలు జరగకుండా.. చర్యలు తీసుకోవాలని మండల కేంద్రం ప్రజలు అన్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.