సరస్వతి పుష్కరాలలో విధులు నిర్వహిస్తున్న మంచిర్యాల జిల్లా.

Duties Duties

సరస్వతి పుష్కరాలలో విధులు నిర్వహిస్తున్న మంచిర్యాల జిల్లా పంచాయతీ రాజ్ ఉద్యోగులు

మంచిర్యాల నేటి ధాత్రి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద మే 15 నుండి నిర్వహిస్తున్న సరస్వతి పుష్కరాలలో పారిశుధ్య కార్యక్రమాలను మంచిర్యాల జిల్లా పంచాయితి రాజ్ ఉద్యోగులు పర్యవేక్షించడం జరుగుతుంది. ఈ సందర్భంగా జిల్లా పంచాయితీ అధికారి డి.వేంకటేశ్వర రావు మాట్లాడుతూ..పుష్కరాలకు అశేష భక్తులు హాజరు అవుతున్నందువలన అక్కడి పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్న క్రమంలో ఎప్పటికప్పుడు పారిశుధ్య కార్మికులతో తడి చెత్త,పొడి చెత్త వేర్వేరుగా సేకరించడం జరుగుతుందని,ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించడంతోపాటు అవసరం ఉన్న చోట బ్లీచింగ్ పౌడర్ చల్లించడం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవడం జరుగుతుందని,మండల పంచాయితీ అధికారులతో నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి డి. వెంకటేశ్వర రావు,మండల పంచాయతీ అధికారులు సఫ్తర్ అలీ, ఇంచార్జీ డి ఎల్ పి ఓ,శ్రీపతి బాపు రావు ఎంపీఓ జైపూర్,సత్యనారాయణ, ఎంపీఓ మందమర్రి,అజ్మత్ అలీ ఎంపీఓ చెన్నూరు, బి.శ్రీనివాస్ ఎంపీఓ బెల్లంపల్లి, జి.అనిల్ కుమార్ ఎంపీఓ తాండూర్,ప్రసాద్ ఎంపీఓ దండేపల్లి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!