ఆయుర్వేదం మన సంప్రదాయ వైద్యం అజయ్ మిశ్రా రిటైర్డ్ ఐఏఎస్
శేరిలింగంపల్లి,
నేటి ధాత్రి:-
నల్లగండ్లలో ఇందూ ఆయుర్వేద క్లినిక్ ప్రారంభం
ఆయుర్వేదం మన సంప్రదాయ చికిత్స, మందుల ద్వారా ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని రిటైర్డ్ ఐఏఎస్ అజయ్ మిశ్రా అన్నారు. నల్లగండ్లలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇందు ఆయుర్వేద హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హాస్పిటల్ వైద్య సిబ్బందితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మన ప్రాచీన వైద్య చికిత్సలో ఎంతో ప్రసిద్ధిగాంచిన ఆయుర్వేద హాస్పిటల్ ను అందరికీ అందుబాటులో ఉండేలా నల్లగండ్లలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఆయుర్వేదం మన సంప్రదాయ చికిత్స, దీని ద్వారా ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవన్నారు. ఎంతోకాలంగా ఆయుర్వేద చికిత్స విధానాలను అనుసరిస్తున్నానని, తద్వారా 35 ఏళ్ల పాటు ఎలాంటి సమస్యలు లేకుండా ప్రభుత్వానికి సేవలందించానన్నారు. మానసిక, శారీరక రుగ్మతలతో పాటు దీర్ఘకాలిక రోగాలకు సైతం మెరుగైన వైద్య చికిత్సలో ఆయుర్వేదంలో అందుబాటులో ఉన్నాయని వైద్యులు ప్రదీప్ నోరి అన్నారు. ఈ తెలంగాణ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ పవన్ మల్లాడి,,