ఘనంగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర గోవిందమ్మల కళ్యాణం
నిజాంపేట నేటి ధాత్రి:
మండల కేంద్రంలోని కొత్త బస్టాప్ వద్ద గల బ్రహ్మంగారి గుడి వద్ద పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమ్మల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బ్రహ్మంగారి గోవిందమ్మల కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం బ్రహ్మంగారి గోవిందమ్మల కళ్యాణాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అన్నదాన కార్యక్రమాలను కూడా నిర్వహించుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నరసింహ చారి, సత్యనారాయణ, రామస్వామి, బాల్ నరసయ్య లక్ష్మీనారాయణ, స్వామి, రామచంద్రం, శ్రీనివాస్, బాలరాజు, మురళి, వెంకటనారాయణ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.