నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలి
జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల విషయం గురించి ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్మీట్ తో జిల్లా ప్రధాన కార్యదర్శి కండే రవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నాం కానీ ఇందులో నిరుపేదలైన రెడ్డి వెలుమలకు మరియు 90 శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇందిరమ్మ ఇండ్లను కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ కమిటీ వారు గ్రామాల్లో కేటాయించాలి ఒక కాంగ్రెస్ పార్టీ వారికి మాత్రమే ఇందిరమ్మ ఇండ్లను కేటాయిస్తే ఇది ప్రజా పాలన కాదు కాంగ్రెస్ పాలన అవుతుంది గ్రామాల్లో ఉన్న అన్ని పార్టీల నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి ఒకవేళ అలా ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ వారికి మాత్రమే కేటాయిస్తే రానున్న స్థానిక ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీ వారిని మాత్రమే ఓట్లు అడగాలి లబ్ధిదారుల ఎంపిక ఒక రూపాయి కూడా ఆశించకుండా జరగాలి ఇందిరమ్మ ఇండ్ల కొలతల్లో ఒకటి రెండు ఫీట్లు పెంచుకొని కట్టుకునే వారికి కూడా అవకాశాన్ని ఇవ్వాలి రానున్న వర్షాకాలన్ని దృష్టిలో పెట్టుకొని లబ్ధిదారులకు బిల్లును సకాలంలో చెల్లించాలి కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ కమిటీ కంటే అధికారులు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు నిర్మాణానికి సంబంధించి లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో సహకరించాలని ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది