కోటగుళ్ల అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి
రాబోయే రోజుల్లో ఆలయం మరింత అభివృద్ధి
దేవదాయ శాఖ డివిజనల్ ఇన్స్పెక్టర్ నందనం కవిత
కోటగుళ్లలో ప్రత్యేక పూజలు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో కోటగుళ్ల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని దేవదాయ శాఖ డివిజనల్ ఇన్స్పెక్టర్ నందనం కవిత అన్నారు. గురువారం ఆమె సిబ్బందితో కలిసి కోట గుళ్ళ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని సాదరంగా ఆహ్వానించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వహణ విషయమై కోటగుళ్లు పరిరక్షణ కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాబోయే రోజుల్లో 43 సెక్షన్ కింద కోట గుళ్ళు దేవాలయం పేరున రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందన్నారు. దీంతో ఆలయం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా అన్నారు. ఆలయ
నిర్వహణ పూర్తిగా కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలోనే కొనసాగుతుందని ఇందులో తమకు ఎలాంటి ప్రమేయం ఉండదని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిడిఎన్ అర్చక సంఘం రాష్ట్ర క్రమశిక్షణ సంఘం కార్యదర్శి కర్నే సాంబయ్య, డిడిఎన్ అర్చక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మహదేవ్,జిల్లా కోశాధికారి సాంబశివుడు, అర్చకులు గురు మూర్తి, చంద్రశేఖర్, రాజు, కోటగుళ్లు పరిరక్షణ కమిటీ గౌరవ అధ్యక్షులు, మామిండ్ల మల్లికార్జున గౌడ్, సభ్యులు నాగపురి శ్రీనివాస్ గౌడ్, రౌతు కిషోర్, గొర్రె ఎల్లయ్య యాదవ్ చిలువేరు ఉదయాకర్, కొయ్యల గౌతమ్ గౌడ్, సామర్ల నాగరాజు, కొయ్యల రమేష్, , తోట నవీన్, బాలాజీ నవీన్, పెద్ది ప్రశాంత్,ఆరెల్లి ఓంకార్, శంకర్ అంజి, పుప్పాల దీపక్, ఆనంద వర్ధన్, నల్లగొండ రాజు , గణేష్ ,వంశీ తదితరులు పాల్గొన్నారు.