విద్యార్థులు ఇష్టపడి చదవాలి పాఠశాల వార్షికోత్సవంలో ఎమ్మెల్యే జీఎస్సార్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలో ఈరోజు మంగళవారం భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో ప్రాథమికొన్నత పాఠశాల, గణపురం మండలంకేంద్రంలోని మోడల్ స్కూల్
ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగిన పాఠశాలల వార్షికోత్సవ వేడుకల్లో భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు.విద్యార్థుల నృత్యాలు, కోలాటాలు చాలా ఆకర్షించాయి. ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతీ ఏడాది పాఠశాలల్లో నిర్వహించే వార్షికోత్సవాలు బడి పట్ల విద్యార్థుల్లో నమ్మకం, విశ్వాసాన్ని నింపుతాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రులతోడ్పాటు ఉంటే అద్భుతాలను సృష్టిస్తారన్నారు.

తల్లిదండ్రులు పిల్లలకు ప్రతీ రోజు కొంత సమయం కేటాయించి, వారితో విద్యాపరమైన సామాజిక అంశాలపై చర్చించడం ద్వారా వారిలో భయం పోతోందన్నారు. చదవుతో పాటు ఆటపాటలు కూడా చాలా అవసరం అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. ప్రతి విద్యార్థి తమ లక్ష్యాలను ఎంచుకొని ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరారు.విద్యార్థుల కళా ప్రదర్శన అద్భుతంగా ఉందని అన్నారు.చెల్పూర్ పాఠశాలలో వాష్ రూమ్స్ పాఠశాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తాను అన్నారు.పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు టెంకాయ కొట్టి ఇట్టి నిర్మాణ పనులను ప్రారంభించాలని చెప్పారు. గణపురం మండలం మోడల్ పాఠశాలలో డైనింగ్ హాల్, సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు.అనంతరం పోటీ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉపాధ్యాయులను శాలువాతో సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీమతి విజయలక్ష్మి , జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ , మండల ఎంపిడిఓ ఎల్ భాస్కర్ ,ఉపాధ్యాయులు , విద్యార్థులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.