
దేవరకద్ర /నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలంలోని రైతు వేదికలో అధికారులు, మండలంలోని వివిధ గ్రామాల ప్రజలతో ముఖాముఖి, సమీక్ష సమావేశాన్ని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా.. గ్రామాల్లోని సమస్యలను ఆయా గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తేవడంతో… సమస్యలపై అధికారులతో చర్చించి, పలు సమస్యలను తక్షణం పరిష్కరించి, మిగతా సమస్యలను ఎమ్మెల్యే నోటిఫై చేసుకున్నారు.