దంపతుల మధ్య నియంత్రణ అవసరం

డాక్టర్ రాజలింగు మోతే

మంచిర్యాల,నేటి ధాత్రి:

వివాహం తర్వాత భార్యాభర్తలు చేసే కొన్ని తప్పులు.. దాంపత్య జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.ఖర్చుల విషయంలోనూ భార్యాభర్తల మధ్య నియంత్రణ అవసరం. ఇందులో ఒక్కరు దుబారా చేసినా తర్వాత అది వైవాహిక బంధంపై ప్రభావం చూపుతుంది.పరస్పర గౌరవం వైవాహిక బంధాన్ని బలోపేతం చేస్తుంది. అగౌరవంగా ప్రవర్తిస్తే త్వరగా వారు విడిపోవడానికి దారి తీస్తుంది.సంసార జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు భార్యాభర్తలు ఒకరినొకరు ఎగతాళి చేసుకోవడం, విమర్శించుకోవడం మానాలి. ఇది మరిన్ని సమస్యలకు దారితీసి వారి బంధాన్ని బలహీనం చేస్తుంది. ఈ సమయంలో ఒకరికొకరు బాసటగా నిలవాలి.దంపతుల మధ్య గొడవ జరిగితే వెంటనే ఇద్దరూ మాట్లాడుకోవడం మానేస్తారు.ఇది వారి మధ్య దూరాన్ని మరింత పెంచుతుంది.పంతానికి పోవడం మాని ఎవరో ఒకరు తగ్గి మాట్లాడాలి.ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో భార్యాభర్తలు ఇద్దరు పరస్పరం సహకరించుకోవాలి. ఇంట్లో అన్ని పనులూ భార్యే చెయ్యాలి అని అనుకోవద్దు. వైవాహిక జీవితం సంతోషంగా సాగాలంటే ఇద్దరూ పరస్పర సమన్వయంతో,సహకారంతో ముందుకు సాగాలి.కోపం వచ్చినప్పుడు స్త్రీ అయినా, పురుషులైనా తమని తాము ని సర్యంత్రించుకొని సమస్యను పరిష్కరించుకోవాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!