పరకాల నేటిధాత్రి
ఉమ్మడి వరంగల్ జిల్లాలలో పర్యటనలో భాగంగా పరకాలకు తెలంగాణ రాష్ట్ర భజరంగ్ కన్వీనర్ శివరాములు,ఉమ్మడి వరంగల్ జిల్లా విహెచ్పి కార్యదర్శి చందర్ బాబులు పట్టణంలోని వివిఆర్ కంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన వినాయకుని దర్శించుకొని పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.ఈ సందర్బంగా మాట్లాడుతూ ఈ రోజు దేశ, ప్రపంచ వ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రజలందరు చక్కగా భక్తి శ్రద్ధలతో పూజించడం జరుగుతుంది.ప్రజలందరూ కుల,మత,వర్గ భేదం లేకుండ, ఆధ్యాత్మికంగా కలిసి ఉ సంఘటితంగా ఉండాలని మనమందరం దేశంకోసం ధర్మంకోసం పని చేస్తూ సంస్కృతులను కాపాడుకోవాలని అన్నారు. రాబోయే రోజులలో హిందూ సమాజం ఏ కోకృతం కావాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో కందుకూరి గరిప్రసాద్,దాన్ని సునిల్ మహేష్,రమేష్,అఖిల్,హరి అయ్యగారు తదితరులు పాల్గొన్నారు.
పరకాలకు చేరుకున్న రాష్ట్ర భజరంగ్ కన్వీనర్ శివరాములు
