చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు గురువారం రోజున మధ్యాహ్న భోజన సమయ విరామ సమయంలో పాఠశాల ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా ఒకే పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం ఇంతవరకు బదిలీలు చేపట్టలేదని, తక్షణమే ప్రభుత్వము బదిలీలు పదోన్నతులు కల్పించాలని, అలాగే 010 పద్ధతి ద్వారా జీతాలు చెల్లించాలని, హెల్త్ కార్డులు కారుణ్య నియామకాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు, నోషనల్ ఇంక్రిమెంట్ ఇప్పించాలని, ప్లే కార్డులు పట్టి నిరసన వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ రాకేష్ ఉపాధ్యాయులు మంజుల శ్రీకాంత్ రఘుపతి కుమారస్వామి రమేష్ ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.