దుమ్ముగూడెం మండలం ముల్కనపల్లి వలస గుత్తి కోయ గ్రామంలో కమ్యూనిటీ కనెక్ట్ పోగ్రామ్ నిర్వహించిన దుమ్ముగూడెం మరియు జిల్లా స్పెషల్ పార్టీ పోలీసులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్
భద్రాచలం నేటి ధాత్రి

తమ స్వార్ధ ప్రయోజనాల కోసం, ఉనికి కోసం ఆదివాసి ప్రాంత అభివృద్ధికి నిరోధకులుగా మారిన మావోయిస్టు పార్టీకి సహకరించవద్దని గ్రామస్తులకు కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసులు
జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ రోజు దుమ్ముగూడెం పోలీసులు మరియు జిల్లా స్పెషల్ పార్టీ సిబ్బంది మండలంలోని మావోయిస్టు ప్రభావిత వలస గుత్తికొయ గ్రామమైన ముల్కనపల్లిలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ ను నిర్వహించడం జరిగింది.ఇందులో భాగంగా అనుమానిత వ్యక్తుల కోసం ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది.అనంతరం గ్రామంలో నివసిస్తున్న మొత్తం 21 కుటుంబాలతో సమావేశం నిర్వహించారు.గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని,అదేవిధంగా తమ స్వార్థ ప్రయోజనాల కోసం తమ ఉనికి కోసం ఆదివాసి ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటూ ఆదివాసీల అభివృద్ధి నిరోధకులుగా మారిన నిషేధిత మావోయిస్టులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించవద్దని గ్రామస్తులకు సూచించినట్లు దుమ్ముగూడెం సీఐ అశోక్ తెలిపారు.దోమల బారిన పడకుండా ఇండ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.డెంగ్యూ మరియు మలేరియా లాంటి విష జ్వరాల ప్రబలకుండా జాగ్రత్తలు పాటించాలని గ్రామస్తులకు సూచించడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో సిఐ బి.అశోక్,ఎస్సై పి.గణేష్,RSI హుస్సేన్,స్పెషల్ పార్టీ సిబ్బంది మరియు ముల్కనపల్లి గ్రామ పెద్దలు మడకం రామయ్య, మడకం మాడయ్య మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!