ఆర్థిక సంస్కరణలతో దేశ భవిష్యత్తును తీర్చిదిద్దిన జ్ఞాని
బహుభాషా కోవిదుడు పీవీ నరసింహారావు:కూకట్ పల్లి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి
కూకట్పల్లి జూన్ 28 నేటి ధాత్రి ఇన్చార్జ్
దివంగత భారత ప్రధాని పీవీ నరసిం హారావు అమోఘమైన తెలివి తేటలకు నిదర్శనమని కూకట్ పల్లి నియోజక
వర్గం కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి అన్నారు. దివంగత భారత ప్రధాని పీవీ నరసిం హారావు జయంతిని పురస్కరించుకుని శుక్రవారం కె పి హెచ్ బి కాలనీలో శేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యం
లో పీవీ నరసింహారావు చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళుల ర్పించారు.ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ భారతదేశ ఆర్థిక వ్య వస్థను ఉద్ధరించి, దేశం ఈ నాడు ఇంత గొప్ప ఆర్థికశక్తిగా వెలుగొందడానికి పునాదులు వేసిన అపర చాణుక్యుడు అని కొనియా డారు. ఇహలో క బంధాలన్నీ వదిలేసి, కుర్తాలం పీఠాధిప తిగా వెళ్దామని సిద్ధ పడుతున్న తరుణం లో దేశమాత పిలు పు వచ్చిందన్నారు.ఎంత మందో అధి కార పీఠం కోసం అర్రు లు చాస్తున్న వేళ,తనొచ్చి ప్రధాన పదవి పీఠాన్ని అధిష్ఠించారని అన్నారు.ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదేళ్ళ పాటు విజయవంతంగా నడ పడంలో అనేక సవాళ్ళు, ఆటుపోట్లు, అపనిందలు ఎదుర్కున్నారని గుర్తు చేశారు. పదవిలో ఉండగానే,కోర్టు ఖ
ర్చు కోసం, ఇల్లు కూడా అమ్ముకున్న
స్థిత ప్రజ్ఞుడని కొనియాడారు.హంగూ, ఆర్భాటం, ఆడంబరం,అతిశయం,
ప్చార యావ లేని నిరాడంబర, రాజనీతిఙ్ఞుడని పేర్కొ న్నారు.పీవీ నరసింహారావు లాంటి గొప్ప నాయ
కుడిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని అన్నారు.కార్య క్రమంలో పా ల్గొన్న వారు డివిజన్ అధ్యక్షులు ప్రవీ
ణ్ కుమార్, మహిళా అధ్యక్షురాలు రజితమ్మ, జోజమ్మ, బి సంజీవరావు, మేకల మైకల్, బి బ్లాక్ అధ్యక్షరాలు రేష్మ, మాజీ వార్డు సభ్యురాలు మనీ అమ్మ,వ ర్కింగ్ ప్రెసిడెంట్ అరవింద్ రెడ్డి ఫణీంద్ర కుమార్ ,బాబ్జి కుమార్,నాగమల్లే శ్వరరావు లుంగీ రాజు,రాజు ముది
రాజు, శేషగిరిరావు,సూరిబాబు,
కొమ్ము బాబు,తదితరులు
పాల్గొన్నారు.