శ్రీ లక్ష్మీనరసింహ దత్త సేన సేవా ట్రస్ట్ వారి ఆర్థిక సహాయం

మంగపేట నేటి ధాత్రి

శ్రీ లక్ష్మీనరసింహ దత్త సేన సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో, మరియు ట్రస్ట్ చైర్మన్ యేడు నూతల ఈశ్వర్ చంద్ శర్మ రామానుజ దాసన్
ఆదేశాల మేరకు ,
మంగపేట మండలం తిమ్మంపేట గ్రామంలో గత కొద్ది సంవత్సరాల క్రితం ప్రమాదవశాత్తు రెండు కాళ్లు పోగొట్టుకున్న మల్లెల వేంకటేశ్వర్లు కు దాత యేడు నూతల వసంతకుమారి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది, అతని గురించి అతని కుటుంబ దీని పరిస్థితి గురించి ఇతరుల ద్వారా తెలుసుకున్న శ్రీ లక్ష్మీనరసింహ దత్త సేన సేవా ట్రస్ట్ వారు వారికి తమ వంతుగా ఆర్థిక సాయం అందించి మల్లెల వెంకటేశ్వర్లుకు ఆయన కుటుంబానికి మనోధైర్యాన్ని నింపారు ,ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీనరసింహ దత్త సేన సేవా ట్రస్టు మండల అధ్యక్షులు నూతులకంటి ఈశ్వర్ చందు మరియు తిమ్మంపేట గ్రామస్తులు పాల్గొన్నారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *