శాంతి నగర్ కాలనీ నందు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

భద్రాచలం నేటి ధాత్రి

ఈరోజు భద్రాచలంలో శాంతి నగర్ కాలనీ నందు శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణం మహోత్సవము సందర్భంగా దాసరి వెంకటనారాయణ – హారతి దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా ప్రారంభించారు. భద్రాచలం వచ్చిన రామ భక్తులకు అన్నదానం నిర్వహించిన దాసరి వెంకటనారాయణ కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాళ్లపల్లి రమేష్ గౌడ్, హరీష్, యలమంచిలి చిన్ను తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!