నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి.
చందుర్తి, నేటిధాత్రి:
ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రాకేష్ మాట్లాడుతూ “ఎండిపోయిన వరి పంట పొలాలకు తక్షణమే ఎకరం 25000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని అదేవిధంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి క్వింటా ధాన్యానికి 500 చొప్పున బోనస్ ప్రకటించాలని కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి ధాన్యం కొనుగోలు చేయాలని” రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు చింతకుంట గంగాధర్, పేరుక గంగరాజు, గడి కొప్పుల జీవన్, ఆది రవి, మెంగని రాజేందర్ శ్రీనివాస్, అయోధ్య పరశురాములు, బోరిగాయ తిరుపతి, మర్రి రాజు, సంపునురి దేవయ్య తదితరులు పాల్గొన్నారు.