భగత్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలి
ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లా కేంద్రంలోని రావి నారాయణరెడ్డి భవన్ లో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జయశంకర్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసఫ్ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారిని ఎదిరించి వేరమరణం పొందిన గొప్ప దేశ బక్తుడని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే భగత్ సింగ్ కు భారతరత్న అవార్డు ఇవ్వాలనికోరారు.అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం భగత్ సింగ్ విగ్రహాన్ని ట్యాంక్ బండి పై ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు. భగత్ సింగ్ జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలని, భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ యాక్ట్ (బిఎన్ఈజీఏ) ఏర్పాటు చేయాలని వివరించారు.భగత్ సింగ్ జీవిత ఆశయాలనునేటి తరాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను భగత్ సింగ్ స్ఫూర్తితో పోరాడుతామని నూతన విద్యా విధానం 2020ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆరబోయిన వెంకటేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు సముద్రాల శ్యామ్, క్రాంతి, బల్లెం రాజకుమార్, గోలి లావణ్య, ఐతవత్తుల చందన, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.