ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలి

నడికూడ,నేటి ధాత్రి:
రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రకటించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) కాకుండా ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలని పిఆర్టియు నడికూడ మండల శాఖ అధ్యక్షులు అచ్చ సుదర్శన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం నిర్ణయించడం శుభసూచకమని ఈ డీఎస్సీ పరీక్షకు ముందే టెట్ నిర్వహించాలని నిర్ణయించి షెడ్యూల్ను ప్రకటించింది. ఈ టెట్ నిర్వహణపై ఉపాధ్యాయుల్లో అసంతృప్తి ఉన్నదన్నారు. 2010 తర్వాత ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు ఖచ్చితంగా టెట్ పాసై ఉండాలని నిబంధన తీసుకొచ్చిన విషయం తెలిసిందే. టెట్ సర్టిఫికెట్ ఉంటేనే వారికి పదోన్నతులు కల్పించనున్నారని రాష్ట్రంలో చాలామంది ఉపాధ్యాయులకు టెట్ సర్టిఫికెట్ లేదని, దాంతో వారికి పదోన్నతులు నిలిపివేశారని ఇలాంటి ఉపాధ్యాయుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా టెట్ నిర్వహించి అందులో ఉత్తీర్ణులు పొందిన ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చినటువంటి ఈ టెట్ నిబంధనలను ఉపాధ్యాయుల కోసం నిబంధనలు సడలించేలా లేదా ప్రత్యేకంగా టెట్ నిర్వహించే విధంగా, లేదా 2010కి ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ తో సంబంధం లేకుండా ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని అచ్చ సుదర్శన్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!