పదో తరగతి పరీక్షా కేంద్రాలను సందర్శన

గుండాల సీఐ రవీందర్

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
సోమవారం నుండి పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో గుండాల సీఐ రవీందర్ మండల కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను సందర్శించారు.గుండాల హైస్కూల్, గురుకులం, కాచనపల్లి నందు బందోబస్త్ ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా అక్కడ ఉన్న అధికారులు మరియు సిబ్బందికి పలు సూచనలు చేశారు.పరీక్షలు ముగిసే వరకు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.పరీక్షకు హాజరయ్యే విద్యార్థులను,ఇన్విజిలేటర్స్,చీఫ్ సూపరింటెండెంట్స్ ను తప్ప ఇతరులను లోనికి అనుమతించరాదని తెలియజేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *