తంగళ్ళపల్లి నేటి దాత్రి… తంగళ్ళపల్లి మండలం గోపాలరావుపల్లి గ్రామంలో యాదవ సంఘం ఎన్నికల్లో అధ్యక్షుడిగా కుక్కల ఆంజనేయులు యాదవ్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని యాదవులు తమపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ తమకు అప్పగించిన ఇంత పెద్ద బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని నాపై నమ్మకం ఉంచిన కులం పెద్దలకు సభ్యులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే యాదవ సంఘం అభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో గ్రామ యాదవ సంఘం సభ్యులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు
గోపాలరావు పల్లెలో యాదవ సంఘం ఎన్నికలు.
