విజయ సంకల్ప యాత్రను విజయవంతం చేయాలి.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రం లో బిజెపి చిట్యాల మండల అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్ అధ్వర్యంలో
సోమవారం రోజున బిజెపి ముఖ్య కార్యకర్తల సమావేశం లో విజయసంకల్పయాత్రను ఈనెల 29వ తారీకు గురువారం రోజున భూపాలపల్లి నియోజకవర్గం లో సాయంత్రం 4.00 గంటలకు ప్రారంభం అవుతున్నది కావున చిట్యాల మండలంలోని బిజెపి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బిజెపి జిల్లా అధ్యక్షులు ఏడు నూతల నిశీధర్ రెడ్డి యాత్ర ప్రముక్ లింగంపల్లి పాపయ్య అన్నారు, ప్రపంచవ్యాప్తంగా ప్రజా ఆదరణ పొందిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ని మళ్లీ ఒకసారి ఎన్నుకోవాలని ఉద్దేశంతోనే దేశ ప్రజలు ఉన్నారని ప్రతి పౌరుడు కూడా ఈ రోజున నరేంద్ర మోడీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన చేసిన సంక్షేమ పథకాలు దేశాభివృద్ధి అనేక రకాల సంక్షేమ పథకాలు మళ్లీ గెలిపిస్తాయని అందరూ కూడా బిజెపి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని దృడ సంకల్పంతో ఉన్నారని ఈసారి లోక్ సభఎన్నికల్లో 400 సీట్లపైగా భారతీయ జనతా పార్టీ గెలుపొంది మళ్లీ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర సభ్యులు చందుపట్ల సత్యపాల్ రెడ్డిబిజెపి రాష్ట్ర కార్యదర్శి బిజెపి జిల్లా మండల సీనియర్ నాయకులు బూత్ అధ్యక్షులు శక్తి కేంద్ర ఇన్చార్జి గుండ సురేష్ చెక్క నరసయ్య గజన ల రవీందర్ పాలకుర్తి బిక్షపతి శ్రీనివాస్ గౌడ్, రాయని శ్రీనివాస్ మైదామ్ శ్రీకాంత్ అశోక్ చారి సంపత్ వివేక్ వీరస్వామి సుందర్ రమేష్ చింతల రాజేందర్ రావుల రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!