గొల్లపల్లిలో ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు

గొల్లపల్లి, నేటి ధాత్రి:
బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర మొదటి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 70 వ జన్మదిన వేడుకలు గొల్లపల్లి మండల కేంద్రంలో కేక్ కట్ చేసి, జై కేసీఆర్ అంటూనినాదాలు చేస్తూ కెసిఆర్ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం కెసిఆర్ ఎన్నో విధాలుగా కష్టపడి అమర నిరాహార దీక్ష చేపట్టి ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రం సాధించి రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి రైతే రాజు లాగా ఉండే విధంగా ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాడని అన్నారు. అలాంటివారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి గోస్కుల జలంధర్, ఎంపీపీ నక్క శంకరయ్య, పిఎసిఎస్ చైర్మన్ గందె మాధవరావు, సింగిల్ విండో డైరెక్టర్ కచ్చు కొమురయ్య, కాంపల్లి హన్మాండ్లు, కనుకుట్ల లింగారెడ్డి, నేరెళ్ల గంగారెడ్డి, అలిశెట్టి రవీందర్, ఓరగంటి అశోక్ రావు, మారం పెళ్లి బాబు, ముస్కు లింగారెడ్డి, బలభక్తుల కిషన్, నల్ల శ్యామ్, బోయపోతు గంగాధర్, భోజనపు శ్రీనివాస్, ఆ వారి చందు, సామల వీరస్వామి, డ్యాగల చందు, రత్నం, శ్రీనివాస్, శోభన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!