విద్యార్థులకు ప్లేట్లు పంపిణీ చేసిన మహిళా మమత తరంగిణి సంస్థ

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట గ్రామంలోని జెడ్పిహెచ్ఎస్ హైస్కూల్ విద్యార్థిని విద్యార్థులకు మంచిర్యాల మహిళ మమత తరంగిణి సంస్థ వారు మధ్యాహ్న భోజనానికి సంబంధించి విద్యార్థులకు ప్లేట్స్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే విద్యార్థులు బాగా చదువుకొని స్కూలుకు మంచి పేరు తేవాలని, చదువుతోపాటు ఆటలో కూడా రాణిస్తూ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని తెలియజేయడం జరిగింది. దూర ప్రాంతం నుంచి స్కూలుకు వచ్చే పేద పిల్లలకి సైకిల్ కూడా ఇస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దుగుట జ్యోతి, శ్రీదేవి, భాగ్యలక్ష్మి, జ్యోత్స్న, చంద్ర దత్, మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!